Sports News:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

Sports News

click here for more news about Sports News

Sports News క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తున్న భారత-పాకిస్థాన్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరగనుంది.దుబాయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పట్ల క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.ఎక్కడైన హీట్ మ్యాచ్ లాంటి ఇలాంటి సమరాలు, స్టేడియం నిండి పోతాయి.

ఈ మ్యాచ్ కోసం టికెట్లు మరింత వేగంగా అమ్ముడుపోయాయి.పాకిస్థాన్ జట్టుకు సంబంధించి, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్‌లో ఆడనుండటం పాక్ అభిమానులకు ఊరట కలిగించే విషయం.ఎందుకంటే, బాబర్ కంటి ఇన్ఫెక్షన్ తో నిన్నటి వరకు బాధపడుతున్నట్లు సమాచారం.అయితే, ఇప్పుడు ఆయన ఆటలోకి రాబోతున్నాడని తెలుస్తోంది. ఇక, టీమిండియా గురించి మాట్లాడితే, జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేనప్పటికీ, భారత జట్టు బలమైనది.సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు యువ పేసర్ హర్షిత్ రాణా మరింత సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరితోపాటు, హార్దిక్ పాండ్యా కూడా పేస్ బౌలింగ్ విభాగంలో ప్రత్యర్థులకు అడ్డంకిగా నిలుస్తాడు.భారత స్పిన్ విభాగం కూడా చాలా బలంగా ఉంది.రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి బౌలర్లు బలమైన స్పిన్ అటాక్ ను రూపొందించారు.భారత బ్యాటింగ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ కూడా బాగుంటే, పాక్ బౌలర్లకు పెద్ద కష్టాలు తప్పవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The nation digest. Gunakan trotoar dan bahu jalan, parkiran pengunjung kantor bpjs kesehatan kab. 4 michigan counties under a winter weather advisory until thursday morning axo news.