కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

సుప్రీం కోర్టు ఇటీవల కారుణ్య నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది అభ్యర్థనలు కుటుంబాల జీవన ప్రమాణాలు సరిగా ఉండాలని భావించే వారు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొంది. అయితే ఈ నియామకాలు కేవలం అవసరమైన వారికే అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎవరి వద్ద కనీస ఆర్థిక సహాయం లేకుండా ఉంటే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపింది. అయితే మరణించిన ఉద్యోగి కుటుంబం మరింత దుర్భరమైన జీవితం గడపాల్సి ఉంటుంది అన్న కారణంతో ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే అవసరం లేదని కోర్టు చెప్పింది.

సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు మరణించిన ఉద్యోగి సంపాదనతో కుటుంబం నడుస్తున్న సందర్భంలో ఆ కుటుంబంలో ఏకమైన అర్హత కలిగిన సభ్యులకు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనితో కారుణ్య నియామకం ద్వారా కుటుంబాన్ని సహాయపడాలని అర్థం. ఈ వ్యాఖ్యలు జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం నిర్వహించిన విచారణ సమయంలో వచ్చాయి.వివరాల్లోకి వెళితే, 2001లో కెనరా బ్యాంకులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు మరణించారు. ఆ ఉద్యోగి కుమారుడు అజిత్ కుమార్ తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని బ్యాంకును ఆశ్రయించాడు.

అయితే బ్యాంకు ఉన్నతాధికారులు దీన్ని తిరస్కరించారు. దీనిపై అజిత్ కుమార్ హైకోర్టుకు వెళ్లాడు హైకోర్టు అతనికి రెండు నెలల్లో ఉద్యోగం ఇవ్వాలని ₹5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తర్వాత బ్యాంకు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు పిటిషన్‌పై విచారణ చేస్తూ కేవలం ఆర్థికంగా అవసరమైన కుటుంబాలకు కారుణ్య నియామకం ఇవ్వాలని మరణించిన ఉద్యోగి కుటుంబం జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. The nation digest. © 2023 24 axo news.