దేశీయ క్రికెట్లో ప్రఖ్యాత బ్యాటర్గా నిలిచిన షెల్డన్ జాక్సన్, తన 15 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్కు ముగింపు పలికాడు మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ప్లేయర్, ప్రస్తుత రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్తో తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించుకున్నాడు.గుజరాత్ జట్టుతో జరిగిన ఆ చివరి మ్యాచ్లో షెల్డన్ 14 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ ముగించాడు. రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి ‘షీల్డ్’ బహుమతి ఇచ్చి సత్కరించింది.38 ఏళ్ల జాక్సన్ 105 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 7,200కి పైగా పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
![అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్](https://thevaartha.com/wp-content/uploads/2025/02/అరంగేట్రం-చేయకుండానే-ముగింపు-పలికిన-స్టార్-క్రికెటర్-1024x576.webp)
అతని అత్యధిక స్కోరు 186 పరుగులు అద్భుతమైన గణాంకాలతో ఉన్న జాక్సన్, భారత్ జట్టులో అరంగేట్రం చేయలేకపోయాడు.2011లో సౌరాష్ట్ర క్రికెట్లో అడుగుపెట్టిన జాక్సన్, 15 ఏళ్లుగా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగాడు. నమ్మకమైన బ్యాటర్, ఫీల్డర్గా తాను సత్తా చూపించాడు. పరిమిత ఓవర్ క్రికెట్లో వికెట్ కీపర్గా కూడా తన సేవలు అందించాడు. గత నెలలో పరిమిత ఓవర్ క్రికెట్కు అతను ముగింపు పలికాడు.జాక్సన్ వైట్బాల్ క్రికెట్లో 84 ఇన్నింగ్స్లలో 2,792 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున 9 మ్యాచ్లు ఆడిన జాక్సన్, కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.శ్రీలంకతో మొదటి వన్డే సమయంలో షెల్డన్ జాక్సన్ క్రికెట్కు విడిపోతున్నట్లు ప్రకటించడం ఎంతో మంది అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.